వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
అదేవిధంగా మత్స్యకారులు మరో రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని అధికారులు వెల్లడించారు.కాగా ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.







