ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాచరిక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం తన పాద యాత్ర ‘యువ గళం’ను ప్రారంభించారు.కుప్పంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేష్ స్థానిక చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు.4000 కిలోమీటర్ల సుదీర్ఘ మారథాన్ వాక్కు తొలి అడుగులు వేసే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.వేలాది మంది పార్టీ కార్యకర్తలతో పాటు, లోకేష్ తన 4000 కిలోమీటర్ల సుదీర్ఘ పాద యాత్రను సరిగ్గా ఉదయం 11.03 గంటలకు ప్రారంభించారు.
పార్టీ కార్యకర్తలు లోకేష్ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలుపుతూ పూల వర్షం కురిపించారు.
లోకేష్ వెంట టాలీవుడ్ హీరో లోకేష్ మామయ్య బాల కృష్ణ, టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్ నాయుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేలాది మంది పార్టీ క్యాడర్ లోకేశ్ వెంట నడిచారు.పార్టీ ప్రధాన కార్యదర్శికి ఘనస్వాగతం పలికేందుకు మహిళా కార్యకర్తలు హారతి ఇవ్వగా,

కుప్పం స్థానికులు ‘చంద్రన్న బిడ్డా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.లోకేశ్కు కుప్పం పౌరులు సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ, అతను రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.లక్ష్మీపురంలోని మక్కా మసీదును, అనంతరం బాపునగర్లోని హెబ్రాస్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిని సందర్శించి ప్రార్థనలు చేసి సంఘ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.

లోకేష్ తన పాద యాత్ర ‘యువ గళం’లో అఖండ విజయం సాధించాలని కోరేందుకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.ఇక అంత సజావుగా సాగుతున్న సమయంలో నందమూరి తారకరత్న గుండెపోటుతో స్పృహ తప్పి పడిపోవడంతో కార్యకర్తల్లో, నాయకుల్లో కొద్దిగా అనిశ్చితి నెలకొంది.ఇక అతను కోలుకోవడంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు.!
.