నాని పాన్ ఇండియా మూవీకి లాక్ డౌన్ ఎఫెక్ట్... ఆగిపోయిన సినిమా

నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.

నేచురాలిటీగా దగ్గరగా ఉంటూ కొత్తదనం ఉన్న కథలపై దృష్టి పెట్టి ఆ దిశగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు.

ఇందులో భాగంగానే నాని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీనికి సంబందించిన పోస్టర్ ని కూడా వదిలారు.

సితారా ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీయడానికి ప్లాన్ చేశారు.ఇక టక్ జగదీష్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావించారు.

ఇంతలో ఊహించని విధంగా కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్ ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద పడింది.సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.

Advertisement

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరల సినిమా షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి.అలాగే థియేటర్లు కూడా ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఒక వేళ షూటింగ్ లు మొదలైన ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న టక్ జగదీష్ సినిమాని నాని పూర్తి చేయాల్సి ఉంది.మరో వైపు ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ నిర్మాతల మీద పడటంతో వాళ్ళు కూడా భారీ బడ్జెట్ ల నుంచి వెనక్కి తగ్గుతున్నారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితిలో భారీ బడ్జెట్ తో సినిమా తీసి దెబ్బ తినడం కంటే కొంత కాలం తక్కువ బడ్జెట్ సినిమాల మీద దృష్టి పెట్టడం ఉత్తమం అని భావించి సితార వాళ్ళు నాని సినిమాని పక్కన పెట్టారని తెలుస్తుంది.దీంతో ఈ సినిమా ఆగిపోయినట్లే అని ప్రచారం నడుస్తుంది.

అయితే చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ విషయం చెప్పేంత వరకు వేచి చూడాల్సిందే.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు