తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది.గ్రూప్-1 ఎగ్జామ్స్ ను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారానికి కారణమైన సిబ్బందితోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహిస్తున్నారంటూ ఈ నేపథ్యంలో పరీక్షను ఆపాలని పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్లను కొట్టేసింది.
కాగా ఈనెల 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.