మనిషి జీవితం 40 ఏళ్ళ వయసుకి ముందు ఒకలాగా, ఆ వయసు దాటిన తరువాత మరొకలాగ ఉంటుంది.బాధ్యతలు పెరగటం వలన, శరీర మార్పుల వలన, స్ట్రెస్ ఎక్కువై మానసికంగా, రోగాలు దగ్గరై శారీరకంగా సతమతమవుతుంటారు.
అందుకే ఆ వయసుకి రాగానే మన లైఫ్ స్టయిల్ లో మార్పులు చేయాలి.
* మూడుపదుల వయసు దాటాక మెల్లిగా కండరాల్లో మాస్ తగ్గుతూ ఉంటుంది.
రక్తం సరఫరా కూడా స్లో అయిపోతుంటుంది.కాబట్టి, వ్యాయామం కంపల్సరీ.
లేదంటే, 50 నుంచి జీవితం కష్టంగా తయారవుతుంది.
* ఆ వయసులో మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.
కాబట్టి ఫైబర్ కంటెంట్ ఒంట్లో ఎక్కువ పడాలి.రైస్ తగ్గించి రొట్టె తినాలి.
ఫైబర్ ఉండే ఫలాలు ఎక్కువ తీసుకోవాలి.
* ఎముకలు అరిగిపోతాయి, బలహీనమవుతాయి.
కాబట్టి కాల్షియం లెవెల్స్ తీసుకోవడం పెంచండి.
* కంటిచూపు జాగ్రత్త.
విటమిన్ సి ఉండే పదార్థాలు తినాలి.మొబైల్స్, ల్యాప్ టాప్ వాడకం తగ్గించాలి.
* వయసు పెరిగినాకొద్ది శరీరంలో సోడియం నీళ్ళ శాతం బ్యాలెన్స్ తప్పుతుంది.కాబట్టి ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి.
అంటే నీళ్ళు బాగా తాగాలి.
* వయసు, బరువు, ఎత్తు, బాడి మాస్ ఇండెక్స్ .అన్ని లెక్కలు వేసుకోండి.ఫ్యాట్ ఉంటే కరిగించండి.
బలహీనంగా ఉంటే బరువు పెంచండి.
* విటమిన్ ఏ, సీ, యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలి.
ఈ వయసులో లేని ఆరోగ్య సమస్యలు శరీరం మీద దాడికి వస్తాయి.కాబట్టి రోగనిరోధకశక్తి పెంచుకోవాలి.
* మరో ముఖ్యమైన విషయం, మెంటల్ హెల్త్ ముఖ్యం.నవ్వండి, ప్రశాంతంగా ఉండండి.
మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది.