రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.అనంతగిరి శివారులోని ఈత వనంలో చిరుత సంచరిస్తుండగా కొందరు స్థానికులు గుర్తించినట్లు సమాచారం.
గ్రామానికి సమీపంలో చిరుత పులి కనిపించడంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.