లెజెండ్ శరవణన్ ఇటీవల కాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.ఐదు పదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిని సైతం ఆశ్చర్యానికి గురి చేశారు.
హీరోగా అవ్వాలి అన్న తన కలను చాలా లేటు వయసులో చాలా ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు శరవణన్.ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకోవడంతో నెటిజన్స్ భారీగా ట్రోల్స్ కూడా చేశారు.
ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియన్ లెవల్లో లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందరినీ షాక్ కి గురి చేయడంతో పాటు, ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చి మరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు.ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ తో థియేటర్లలో రిలీజ్ చేసి అందర్నీ ఆకట్టుకుంటున్నారు.ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శరవణన్.
ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే కాశ్మీర్లో కొత్తిమీర షూటింగ్ ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట.ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమాను ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు.కాగా శరవణన్ కాశ్మీర్లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.