హస్తం గూటికి వివిధ పార్టీల నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లుపల్లి, రాజేశ్వరరావు నగర్ గ్రామాల్లో భారీ ఎత్తున యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.వీరందరికీ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకడం జరిగింది.

 Leaders Of Various Parties Join Hands , Various Parties, Kk Mahender Reddy-TeluguStop.com

ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న దోపిడీ అరాచకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టి బిఆర్ఎస్ ను గద్దె దించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడమే దీనికి నిదర్శనమని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలపైనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సంతకం చేయడం జరుగుతుందని తెలిపారు.సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన ఓటు వేసి తనకు భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమిద్,ఎంపిటిసి పరుశురాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, మల్లుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్ గౌడ్, రాజేశ్వరరావు నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు దేవయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిట్ల వెంకటయ్య,కిషన్ గౌడ్, ఎర్ర వేణు,సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పంతం సురేష్, బిసి సెల్ మండల అధ్యక్షులు గుర్రం రాజు గౌడ్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు యాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube