నందమూరి కుటుంబంలో తారకరత్న ఒకరు.సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు.
అయితే ఒకటి అరా సినిమాలతో ఆకట్టు కున్నప్పటికీ హీరోగా కొనసాగలేక పోయాడు.అయితే ఈయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు నచ్చిన పాత్రలను చేస్తూ వస్తున్నాడు.
నటుడిగా కొనసాగుతూనే ఏపీ రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు.
తమ ఫ్యామిలీ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే తారకరత్న ప్రస్తుతం కొనసాగు తున్నాడు.
ఇదిలా ఉండగా నిన్న నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు అనే వార్త తెలుగు ప్రజలకు షాక్ ఇచ్చింది.నిన్న ఏపీ లో తెలుగుదేశం అధ్యక్షుడు నారా లోకేష్ పాదయాత్రలో ఈ విషాదం చోటు చేసుకుంది.
నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా తారకరత్న కూడా పాల్గొన్నారు.
ఈ పాదయాత్రలో భారీ అభిమానులు, పార్టీ సభ్యులు తరలి వచ్చారు.వీరి భారీ మోహరింపు కారణంగా తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.భారీగా అభిమానులు చుట్టు ముట్టడంతో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.
దీంతో ఈయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగుళూరికి షిఫ్ట్ చేస్తున్నట్టు నిన్న బాలకృష్ణ తెలిపారు.
మరి ఈయన ఆరోగ్యంపై నందమూరి ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్యంపై వరుస అప్డేట్ లను కుటుంబ సభ్యులు తెలుపు తున్నారు.మరి ఇప్పుడు ఈయన హెల్త్ గురించి తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది.ఈ అర్ధరాత్రి 12 గంటల సమయంలో తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి వైద్యం స్టార్ట్ చేసారు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు తారకరత్నను కలవడానికి సాయంత్రం విజయవాడ నుండి బెంగుళూరుకు వెళ్లనున్నారు.