సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ‘లైగర్’. ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
అయితే ఈ సినిమా అప్డేట్ కోసం లైగర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కానీ ఈ సినిమా అప్డేట్ మాత్రం పూరీ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ అంతా గుర్రుగా ఉన్నారు.
అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఇప్పటికే షూట్ మొత్తం పూర్తి అయ్యింది అని అంతా అనుకున్నారు.అయితే ఈ సినిమాలో ఇంకా ఒక సాంగ్ షూట్ అవ్వలేదట.
దీంతో ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా టీమ్ ను మళ్ళీ సాంగ్ కోసం రెడీ చేస్తున్నారట.ఇప్పుడు లాస్ట్ సాంగ్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట.ఈ సాంగ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే మధ్య ఉండనుంది.ఈ సాంగ్ షూట్ ముంబై లో జరుగుతున్నట్టు టాక్ బయటకు వచ్చింది.మరి ఈ సాంగ్ అయిపోతే లైగర్ ప్రొమోషన్స్ మొదలు పెట్టనుందట.చూడాలి మరి పూరీ ఎలాంటి అప్డేట్స్ రెడీ చేస్తున్నాడో.