బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( MLA Lasya Nanditha ) మృతదేహానికి ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.ఈ మేరకు సాయంత్రం ఈస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికలో పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.</br
ప్రస్తుతం కంటోన్మెంట్ ( Cantonment )నివాసంలో ఉన్న లాస్య భౌతిక కాయానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.అయితే ఇవాళ తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్( Patancheru ) పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.తీవ్రగాయాలు కావడంతో ఆమె ఘటనాస్థలంలోనే చనిపోగా.డ్రైవర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.