తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు.ఇవాళ ఐదు చోట్ల మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు.
ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటీఆర్ రానున్నారు.ఈ క్రమంలోనే భద్రాచలం, ఇల్లందు, ఖమ్మం నియోజకవర్గాల్లో రోడ్ షో చేయనున్నారు.
సాయంత్రం అంబర్ పేట్, ముషీరాబాద్ లో నిర్వహించే రోడ్ షోలో కేటీఆర్ పాల్గొననున్నారు.సుమారు పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు.