Prabhas : చివరి క్షణంలో కృష్ణంరాజు ప్రభాస్ చేత అలాంటి ఒట్టు వేయించుకున్నారా.. అందుకే ఇలా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కృష్ణంరాజు ( Krishnam Raju ) ఒకరు అయితే ఈయన గత ఏడాది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి మనకు తెలిసిందే.దాదాపు 7 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కళామతల్లికి సేవలు చేసినటువంటి కృష్ణంరాజు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Krishnam Raju Takes Word From Prabhas Know Details Inside-TeluguStop.com

ఇక ఈయన వారసుడిగా నటుడు ప్రభాస్ ( Prabhas ) ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈశ్వర్ సినిమా ( Eeshwar )ద్వారా ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం వరుస సినిమాలో నటించే అవకాశాలను అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

Telugu Bahubali, Eeshwar, Krishnam Raju, Prabhas Raju, Radheshyam, Saalar, Spiri

బాహుబలి సినిమా( Bahubali movie )తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.గత ఏడాది ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈయన అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు ప్రభాస్ చేత ఒక మాట తీసుకున్నారట.నేను ఉన్నా లేకపోయినా కొన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించాలని అలా నిర్వర్తిస్తానని నాకు మాట ఇవ్వు అంటూ ప్రభాస్ చేత ఒక మాట తీసుకున్నారని తెలుస్తుంది.మరి కృష్ణంరాజుకు ప్రభాస్ చేసినటువంటి ఆ ప్రామిస్ ఏంటి అనే విషయాన్ని వస్తే…

Telugu Bahubali, Eeshwar, Krishnam Raju, Prabhas Raju, Radheshyam, Saalar, Spiri

కృష్ణంరాజు కుటుంబం క్షత్రియుల కుటుంబానికి చెందినది అయితే ఈ కుటుంబంలోని వారందరూ కూడా ఇంటికి శత్రువు వచ్చినా కూడా వారి కడుపు నింపే స్వభావం కలవారు.అందుకే కృష్ణంరాజు ఇతరులకు ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతోమంది గొప్పగా చెప్పుకున్నారు.ఇక తన పెదనాన్న చూసి ప్రభాస్ కూడా అదే బాటలోనే నడుస్తున్నారు.ఇప్పటికే ఈయనతో పని చేసినటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని వెల్లడించారు.ప్రభాస్ ఆతిథ్యం ఇస్తే మనం తినలేము అంటూ ఈయన గురించి ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతో గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.

Telugu Bahubali, Eeshwar, Krishnam Raju, Prabhas Raju, Radheshyam, Saalar, Spiri

ఇక ఇదే విషయం గురించి కృష్ణంరాజు( Krishnam Raju మరణించే సమయంలో మన ఇంటికి ఎవరు వచ్చిన ఆకలితో వెళ్లకూడదు.ఇంటికి వచ్చిన వారు ఒట్టి చేతులతో బయటకు వెళ్ళకూడదు ఇలా ఇంటికి వచ్చిన వారందరికీ అతిథి మర్యాదలు చేసి వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపించాలని చెప్పారట.అదే విధంగా ఇంటి బాధ్యతలు తీసుకొని తన చెల్లెల బాధ్యతలు కూడా నీవే పెళ్లి చేయాలి అంటూ ప్రభాస్ కి ఈ బాధ్యతలను అప్పజెప్పారట.

ఇలా తన పెదనాన్నకు ఇచ్చిన మాట ప్రకారమే ప్రభాస్( Prabhas ) ఇంటికి వచ్చిన వారందరికీ అతిధి మర్యాదలు చేయడమే కాకుండా తన చెల్లెల బాధ్యతలను కృష్ణంరాజు కుటుంబ బాధ్యతలను కూడా తన భుజాలపై వేసుకున్నారు .ఇక వీరందరికీ పెళ్లి చేసిన తర్వాతే తాను కూడా పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారని అందుకే ఇప్పటికి కూడా ఆయన పెళ్లి గురించి మాట్లాడకుండా తన పెదనాన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube