రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తులు చాలా ఇంటలిజెంట్ గా మాట్లాడుతుంటారు.వారి తెలివి ముందు అవతల వారు ఎప్పుడు బోల్తా కొట్టాల్సిందే.
అయితే వర్మ మాత్రమే కాదు అతని శిష్యవర్గం అందరూ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు.తప్పు వారిదైనా సరే చాలా బాగా డిఫెన్స్ చేసుకోగలరు.
అలా వర్మ శిష్యుల్లో ఒకడైన కృష్ణవంశీ కూడా వర్మకు ఏ మాత్రం తక్కువ కాదు.కృష్ణ వంశీ తో సైతం మాటల్లో ఎవ్వరు నెగ్గలేరు.
బాగా పుస్తకాలు చదువుతాడు, మంచి సినిమాలు తీస్తాడు.ఇక ఎవరితోనో పెద్దగా తగాదాలు పెట్టుకునే టైపు కాదు.
రంగమార్తాండ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో పలు మీడియా సంస్థలకు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు కృష్ణవంశీ.ఈ సందర్భంలో తన స్నేహితుడైన ప్రకాష్ రాజు పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.అవేంటో తెలుసుకుందాం.
కృష్ణ వంశీ, ప్రకాష్ రాజ్ ఇద్దరు మంచి స్నేహితులు.వీరి స్నేహం సినిమా వరకు మాత్రమే కాదు ఇద్దరూ కలిసి మందు కొట్టెంత అభిమానం కలిగి ఉన్నారు.అయితే వీరిద్దరూ కలిసి ఒక్కసారి సిట్టింగ్ వేస్తే ఆ తర్వాత ఏం చేస్తారు అనే విషయం కృష్ణవంశీ బయటపెట్టాడు.
కృష్ణవంశీ మరియు ప్రకాష్ రాజ్ ఇద్దరు ఇళయరాజా కి అభిమానులు దాంతో గంటలు గంటల పాటు ఇళయరాజా పాటలు వింటూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తారట.ఆ టైం లో అసలు ఒకరితో ఒకరు మాట కూడా మాట్లాడుకోరట.
ఒకవేళ మాట్లాడుకోవాల్సి వస్తే పాటలను పక్కన పెట్టి పాత హిందీ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారట.లేదంటే ప్రకాష్ రాజ్ తను రాసిన బుక్స్ లోని సంఘటనలు వివరిస్తూ ఉంటాడట.
ఇలా వీరి సిట్టింగ్స్ గడిచిపోతూ ఉంటాయి.
ఇక ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ పై ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది ఆలస్యంగా వస్తాడు అని, రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తాడు అని అనుకున్న టైంకి పని పూర్తి చేయడు అని అంటూ ఉంటారు కానీ ఈ విషయంలో కూడా కృష్ణవంశీ ఒక క్లారిటీ ఇచ్చాడు.సాధారణంగా సెలబ్రిటీలు అందరూ అలాగే చేస్తారు కానీ అది తెలియకుండా స్వీట్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు.జరగాల్సిన లేట్ ఎలాగూ జరుగుతూనే ఉంటుంది.
కానీ అది చెప్పే విధానంలోనే తేడా ఉంటుంది.ప్రకాష్ రాజ్ కి అది తెలియకపోవడం వల్లే త్వరగా ఏదో ఒకటి మాట్లాడేసి అందరి ముందు బయటపడిపోతూ ఉంటాడు అని కృష్ణవంశీ చెప్పుకచ్చాడు.