యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటేనే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 35వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన మొదట్లో అలియా భట్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే అలియా పెళ్లి చేసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, అలియా స్థానంలో రష్మిక నటిస్తుందనే వార్తలు వచ్చాయి.
ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా విడుదలవుతున్న సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న కొరటాల ఎన్టీఆర్ 30వ సినిమా గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య సినిమా విడుదలైన తర్వాత కాస్త విరామం తీసుకుని ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తామని వెల్లడించారు.ఈ సినిమా మే నెలలో పూజా కార్యక్రమాలను ప్రారంభించి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని తెలిపారు.
మే 28వ తేదీ సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయం గురించి వెల్లడిస్తామని తెలిపారు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అలియా నటిస్తున్నారా? లేక రష్మిక నటిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి చర్చించలేదని కొరటాల క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.దీంతో ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గురించి వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తెలిసిపోయింది.
మరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారో తెలియాల్సి ఉంది.