నారా లోకేష్ కి సంచలన సవాల్ విసిరిన కొడాలి నాని..!!

ఏపీ మంత్రి కొడాలి నాని టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.

చాలా సందర్భాలలో కొడాలి నాని.

నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో డైలాగులు వేయడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల వాతావరణం అలముకున్న క్రమంలో మరోసారి లోకేష్ పై ఊహించని కామెంట్లు చేశారు.

పూర్తి విషయం లోకి వెళ్తే లోకేష్ కి సవాల్ చేశారు కొడాలి నాని.జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో నారా లోకేష్ సొంత జిల్లా చిత్తూరు కి వెళ్లి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచి చూపించాలని, లోకేష్ సర్పంచ్ గా గెలిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని కొడాలి నాని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో ఫిబ్రవరి మొదటి తారీకు నుండి నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ చేస్తున్న తరుణంలో కొంతమంది రాజ్యాంగ వ్యవస్థలను, ఎలక్షన్ కోడ్ ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టు కొడాలి నాని ఆరోపించారు.అదేవిధంగా టిడిపి ఒక దిక్కుమాలిన పార్టీ అని.అందువల్లే ఒక మంచి కార్యక్రమంపై నిమ్మగడ్డకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగిందని సీరియస్ అయ్యారు. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ప్రజలను నమ్ముకొని పరిపాలన చేస్తూనట్లు స్పష్టం చేశారు.

Advertisement

వైసీపీ పతనం స్టార్ట్ అయ్యింది అని అనటానికి చంద్రబాబుకు సిగ్గు లేదన్నారు.ఆయన ఒక పెద్ద మోసగాడు అని కొడాలి నాని పేర్కొన్నారు.మొత్తం ఎన్నికలు అయ్యేలోపు రాష్ట్రం నుండి చంద్రబాబు నారా లోకేష్ ని ప్రజలు వెళ్లగొట్టడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.

 .

Advertisement

తాజా వార్తలు