హైదరాబాద్( Hyderabad ) లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర( BJP Vijaya Sankalpa Yatra )లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి( Kishan Reddy ) మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఒక్క దుర్ఘటన కూడా జరగలేదని చెప్పారు.
కాంగ్రెస్( Congress ) హయాంలో బాంబులు పేలి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఐపీఎస్( IPS ) అధికారులను నక్సలైట్లు చంపేశారన్నారు.అటు కేటీఆర్ ను సీఎం చేసేందుకే కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచినా.
గెలవకపోయినా చేసేది ఏమీ లేదని చెప్పారు.ఇక రాహుల్ గాంధీ ఎన్నికల తరువాత మళ్లీ విదేశాలకు వెళ్తారని విమర్శించారు.