జబర్దస్త్ షో( Jabardasth ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న ఆర్పీ( Kiraak RP ) నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు( Nellore Peddareddy Chepala Pulusu ) ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అవుతున్నారు.హైదరాబాద్ లో ఇప్పటికే మూడు బ్రాంచ్ లను ఓపెన్ చేసిన ఆర్పీ అనంతపురానికి సంబంధించి ఫ్రాంఛైజీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఆర్పీ చేపల పులుసు ఖరీదు తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అనంతపూర్ బ్రాంచ్ లో కేజీ కోరమీను పులుసు కొనుగోలు చేయాలంటే ఏకంగా 1800 రూపాయలు ఖర్చు చేయాలట.
కోరమీను పులుసు ఎంత రుచికరంగా చేసినా ఈ స్థాయిలో ఖర్చు చేయడం అంటే ఒక విధంగా రిస్క్ అనే చెప్పాల్సి ఉంటుంది.కోరమీను కేజీ ధర 500 రూపాయలు కాగా దీనిని కూరగా వండితే నాలుగు రెట్లు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలా అని అనంతపూర్ వాసులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆర్పీకి ఉండే క్రేజ్ వల్ల కొన్ని నెలల పాటు బిజినెస్ బాగా జరిగినా దీర్ఘకాలంలో ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది.ఆర్పీ రేట్లు తగ్గిస్తే బిజినెస్ బ్రహ్మాండంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు మరి ఆర్పీ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.ఆర్పీ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్నారు.రాబోయే రోజుల్లో ఆర్పీ బుల్లితెరపై రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

ఆర్పీ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.ఆర్పీ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఆర్పీ జబర్దస్త్ షోలోకి మాత్రం రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.
ఆర్పీకి అదృష్టం కలిసొస్తే కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది.