ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల అంశంపై గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.మోదీ సర్టిఫికెట్లు పీఎంవో చూపించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మోదీ సర్టిఫికెట్లు పీఎంవో చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.అనంతరం పిటిషన్ వేసిన అరవింద్ కేజ్రీవాల్ కు హైకోర్టు రూ.25 వేలు జరిమానా విధించింది.