సీబీఐ నకిలీ అధికారి శ్రీనివాస్ కేసు నేపథ్యంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.సీబీఐ అరెస్ట్ చేసిన శ్రీనివాస్ అందరికీ సుపరిచితుడేనన్నారు.
శ్రీనివాస్ తో తనకున్నది కుల సంబంధమేనని తెలిపారు.శ్రీనివాస్ తనని డబ్బులు అడగలేదని, తాను కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థలకు సహకరించాలని విచారణకు వెళ్లినట్టు తెలిపారు.శ్రీనివాస్ ను కాపు సంఘం సమావేశంలో కలిశానని చెప్పినట్టు మంత్రి గంగుల స్పష్టం చేశారు.