ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో భేటీ కానున్నారు.ఈ సమావేశానికి పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో పాటు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారని తెలుస్తోంది.
జనవరి 26 నుంచి పీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులకు ఏఐసీసీ దిశానిర్దేశం చేయనుంది.







