ఏపీలో జీపీఎస్ విధానంపై మంత్రి బొత్స మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఓపీఎస్ ను అమలు చేయడం ప్రభుత్వానికి కష్టం మరియు భవిష్యత్ తరాలకు నష్టమని పేర్కొన్నారు.
అందుకే సీపీఎస్ విధానం అమలులోకి వచ్చిందని మంత్రి బొత్స తెలిపారు.ఈ క్రమంలోనే సీపీఎస్ తోనూ నష్టమంటే ఉద్యోగుల కోసం జీపీఎస్ తీసుకొచ్చామని చెప్పారు.
జీపీఎస్ లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.ఇక జీపీఎస్ ను కూడా వద్దంటే సాధ్యం కాదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.