కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు కీలక వ్యాఖ్యలు చేశారు.కర్ణాటకలో బీజేపీపై వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదని చెప్పారు.
అదేవిధంగా బీజేపీకి ఓట్ల శాతం ఎక్కడా తగ్గలేదని తెలిపారు.గతంలో అసెంబ్లీ స్థానాల్లో ఓడి పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావాన్ని చూపించవని స్పష్టం చేశారు.అదేవిధంగా ఒక్క రాష్ట్ర ఎన్నికల ఫలితాలు పక్క రాష్ట్రాలపై ప్రభావం చూపవని తెలిపారు.