సీఎం జగన్ అన్ని విషయాలు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.పోలవరం ప్రాజెక్ట్, విభజన అంశాలతో పాటు స్టీల్ ప్లాంట్ పై ప్రధానితో మాట్లాడారని తెలిపారు.
లోకేశ్ పాదయాత్ర… అమరావతి దొంగ రైతుల పాదయాత్రలానే ఉంటుందని విమర్శించారు.ప్రత్యేక హోదా గురించి బీజేపీని పవన్ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
పేదలకు ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్ మహా యజ్ఞంలా చేస్తున్నారని వెల్లడించారు.