అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిసెంబర్ 24వ తేదీన జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటికి, అక్కడి ఎంఎల్ఏ పెద్దారెడ్డి తన అనుచరులతో వెళ్ళి అక్కడ ఉన్న వారిపై దాడి చేశాడని జేసి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశాడు.అదే రోజు జేసి అనుచరులు తాడిపత్రిలో తమ కార్యకర్తలతో కలిసి అలర్లు సృష్టించడంతో జేసి పైన పెద్ద రెడ్డి అనుచరుల పైన పోలీసులు ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
పోలీసుల తిరుపట్ల అసహనం వ్యక్తం చేస్తూ జేసి ప్రభాకర్ రెడ్డి నిన్న సోమవారం నాడు ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు.రాజకీయనాటక పరిణామాల నడుమ జేసి ఆమరణ నిరాహార దీక్షను విరమించాడు.
తాడిపత్రి జేసి వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లుగా ఉంది ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా కేతి రెడ్డి పెద్దా రెడ్డి మాట్లాడుతూ.జేసి తన ఉనికిని కాపాడుకోవాలనే అలా చేస్తున్నారని అన్నాడు.మేము అధికారంలోకి వస్తే అప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉంటాయని పోలీసులను బేదిరిస్తున్నాడని చెప్పాడు.
ఎస్సి ఎస్టి కేసుల గురుంచి జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం సిగ్గు చెట్టు అన్నారు.నేను సంది కోసం ప్రయత్నం చేస్తుంటే వారు కావాలనే గొడవకు దిగుతున్నారని పెద్దారెడ్డి అన్నాడు, చంద్రబాబు డైరక్షన్ లో ఇదంతా జరుగుతుందని విమర్శించాడు.
జేసి బ్రదర్స్ కి జిల్లా నాయకులు ఎవరు సహకరించడం లేదని అన్నాడు.