జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఈసారి కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎలాగైనా ఓడించడానికి ఇప్పటికే పలు పార్టీలను కూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రకంగా కలిసిన పార్టీలన్నీ “ఇండియా” కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికలలో కలసి పనిచేయటానికి రెడీ అవుతున్నాయి.ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలు చాలా సందర్భాలలో సమావేశం కావడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇదే “ఇండియా” కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) కూడా భాగస్వామ్యం కావడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీ పార్లమెంట్ మొత్తం స్థానాలు ఏడు చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ( Kejriwal )తప్పుపట్టారు.
కూటమిలో ప్రధాన పార్టీనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆప్ అభ్యంతరం తెలిపింది.ఒంటరిగా పోటీ చేయాలనుకున్నప్పుడు పెట్టిన కూటమికి అర్థం లేదని స్పష్టం చేశారు.ఈ పరిణామంతో ఇండియా కూటమిలో సీట్ల గొడవ అప్పుడే స్టార్ట్ అయిన పరిస్థితి నెలకొంది.







