మహానటి చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ కీర్తి సురేష్, ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
ఇదివరకు కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ బ్యూటీ, తాజాగా పెంగ్విన్ అనే సినిమాను తెరకెక్కిస్తోంది.
తమిళంలో సూపర్ సక్సెస్ అందుకుంటున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ భావించినా, లాక్డౌన్ కారణంగా అది కుదరలేదు.
కాగా తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ టీజర్ చూస్తుంటే ఇదొక పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కినట్లు తెలుస్తోంది.
వరుసగా జరిగే హత్యలు, వాటి వెనకాల ఉన్న హంతకులు ఎవరనే విషయాలను ఈ సినిమాలో మనకు చూపించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక కీర్తి సురేష్ కూడా ఈ హత్యలకు కారణమైన వారి వల్ల తన కొడుకును కోల్పోవడం, వారిని పట్టుకునేందుకు ఆమె వంతు ప్రయత్నం చేయడం లాంటివి ఈ సినిమాలో మనకు కనిపించనున్నాయి.
మొత్తంగా చూస్తే ఈ సినిమా ఒక పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వస్తుండగా, కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈశ్వర్ కార్తిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
మరి పెంగ్విన్ అనే టైటిల్ను ఈ సినిమాకు ఎందుకు పెట్టారో తెలియాలంటే మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాను థియేటర్స్ లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్లో జూన్ 19న రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy