దేశ రాజకీయాల్లో ప్రవేశించాలని భావించిన కేసీఆర్ దానికి తగ్గట్టుగానే ఒక్కో అడుగు వేసుకుంటూ వెళుతున్నారు . మెుదటి అడుగులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు.
తన జాతీయ రాజకీయాల ఆశయాలలో భాగంగా అతి త్వరలో ఆయన దేశం మొత్తం పర్యటించనున్నారు. దేశంలో ఉన్న ప్రాంతీయ సెంటిమెంట్ను ప్రేరేపిస్తూ కేసీఆర్ ముందుకు వెళ్ళలని భావిస్తున్నారు.
బీఆర్ఎస్, రాష్ట్ర రాజకీయాలతో కేసీఆర్ తెలంగాణకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఒక్కొ రాష్ట్రంలో భిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎలాంటి శైలితో వెళుతారనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న.ఏపీలో అడుగు పెట్టాలంటే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ పక్కనబెట్టి రాష్ట్రాల్లో స్థానిక రాజకీయాలు, ఇప్పటికే ఉన్న పార్టీలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడితే టీడీపీ అధినేత దగ్గరకు వెళ్లక తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.ఇది నాయుడికి, టీడీపీకి డీల్ బ్రేకర్ అవుతుంది.2018 ఎన్నికలకు చూస్తే, చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసి, కాంగ్రెస్తో పొత్తు కూడా పెట్టుకున్నారు. తెలంగాణలో చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని కేసీఆర్ భారీ స్థాయిలో ఉపయోగించుకుని ప్రచారం నిర్వహించి విజయవంతం చేశారు.

ఇప్పుడు కేసీఆర్ సెంటిమెంట్ను ఉపయోగించుకుని ప్రాంతీయ వివాదాలను రెచ్చగొట్టే అవకాశం లేదు.ఈ ఆలోచన ఇప్పుడు తెలుగుదేశంకు అనుకూలంగా పని చేస్తుందని, చంద్రబాబుకు కేసీఆర్ తప్ప మరెవరూ ఈ అవకాశం ఇవ్వలేరని విశ్లేషకులు అంటున్నారు.ఇది స్వాగతించదగిన పరిణామమని, టీడీపీకి పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు కూడా అంటున్నారు.రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, మహబూబ్నగర్, ఆదిలాబాద్లలో టీడీపీ ఇప్పటికీ డీసెంట్ క్యాడర్తో బలంగా ఉంది.
తెలంగాణ టీడీపీ చీఫ్గా కాసాని జ్ఞానేశ్వర్ నియామకంతో ఆ పార్టీ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.ఏకంగా తెలంగాణా అంతటా పర్యటించేందుకు చంద్రబాబు నాయుడుకు ఫుల్ స్కోప్ ఉంది, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదుగుతారో లేదో తెలియదు