అప్పుడే హామీ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్‌ నాటకాలాడుతున్నారు

తెలంగాణకు అన్యాయం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు అంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులెటరీ విస్తరణకు సంబంధించిన జీవో జారీ చేయడంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.

ఉమ్మడి నల్లగొండ మరియు మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లబోతున్నట్లుగా ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు.తాజాగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.

గతంలో జగన్‌, కేసీఆర్‌ భేటీ అయిన సందర్బంగానే పోతిరెడ్డి పాడు వ్యవహారం చర్చకు వచ్చి ఉంటుందని, ఆ సమయంలో ఓకే అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.న్యాయ పోరాటం అనేది కేవలం నాటకం మాత్రమే అని, ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగా లేదన్నాడు.

సీఎం ఈ విషయంలో ఇప్పటి వరకు పెద్దగా స్పందించక పోవడంతో తెలంగాణ ప్రభుత్వ తీరు అర్థం అవుతుందంటూ ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి అన్నారు.

Advertisement
వైసీపీ సీనియర్ల చూపు ఆ పార్టీ పై పడిందా ? 

తాజా వార్తలు