పార్లమెంట్ ఎన్నికల్లో గత రికార్డును తిరగరాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) అన్నారు.తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి( Minister Uttam Kumar Reddy ) సవాల్ చేస్తున్నానని చెప్పారు.
హుజూర్ నగర్ కంటే నల్గొండ నుంచి ఎక్కువ మెజార్టీ తెస్తానని ఛాలెంజ్ చేసినట్లు తెలిపారు.నల్గొండలో రఘువీర్ రెడ్డి, భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

కేసీఆర్( KCR ) యాత్ర చేసి ఎండిన పంటలను పరిశీలిస్తానంటున్నారన్నారు.కానీ నల్గొండను ఎండబెట్టిందే కేసీఆర్ అని విమర్శించారు.సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కేసీఆర్ కారణమని ఆరోపించారు.







