తెలంగాణ ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటి వరకు కెసీఆర్ స్పందించడం లేదని అనుకున్న వారికి కెసీఆర్ సరైన సమాధాన ఇచ్చారు.
ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని మాది కూడా రాజకీయ పార్టీయేనని మఠం కాదని మాకు సర్వేలు ఉంటాయని వచ్చే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కెసీఆర్ విరుచుకుపడ్డ పరిస్థితి ఉంది.అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు టీఆర్ఎస్ ముందున్న అతి పెద్ద సవాల్ కావడంతో చాలా ఆచితూచి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రస్తుతం ప్రతిపక్షాల రూపంలో ప్రభుత్వానికి అతి పెద్ద సవాళ్ళు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కలిగించడానికి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న తరుణంలో కెసీఆర్ ప్రతిపక్షాలను బలహీన పరిచేలా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది.
అయితే రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి మధ్య పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలనున్న పరిస్థితులలో అయితే తన మాటలలో ప్రతిపక్షాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది.
అయితే ప్రతిపక్షాలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులలో ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో విఫలమవుతున్న పరిస్థితి ఉంది.అంతేకాక కెసీఆర్ కూడా ప్రజల అభిప్రాయాన్ని సర్వే రూపంలో తన దగ్గర ఉంటుంది.
కాబట్టి కెసీఆర్ ను ప్రతిపక్షాలు విమర్శించినా భవిష్యత్తులో తన పనితీరుతో సమాధానం చెప్పే అవకాశం ఉంది.ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే కెసీఆర్ వ్యాఖ్యలు వేరేలా ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా కెసీఆర్ వ్యూహం అనేది అర్ధం కావడం చాలా కష్టం కాబట్టి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ బలోపేతానికి చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా చేసే అవకాశం ఉంది.