సాధారణంగా చెప్పాలంటే భోజనం చేసిన వెంటనే కొంత మంది ఇంకా చాలా రకాల పదార్థాలను తినడం కానీ, త్రాగడం కానీ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్ని రకాల పానీయాల జోలికి అసలు వెళ్ళకూడదు.
ఈ పానీయాలను తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కచ్చితంగా వస్తాయి.ఆ పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ( Tea Coffee ) తాగడం వల్ల జీర్ణ క్రియ పై చెడు ప్రభావం పడుతుంది.
కాబట్టి టీ లేదా కాఫీని అస్సలు తీసుకోకూడదు.అలాగే భోజనానికి ఒక గంట ముందు భోజనం తర్వాత ఒక గంట తర్వాత మాత్రమే టీ లేదా కాఫీ తాగవచ్చు.భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి అలసట, బలహీనత, వంటి వివిధ అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఇంకా చెప్పాలంటే భోజనం చేసిన వెంటనే మద్యం ( Alcohol ) తాగితే అది శరీరానికి ఎంతో హానీ చేస్తుంది.అలాగే ఇది జీర్ణ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది.
భోజనానికి ముందు లేదా తర్వాత కనీసం అరగంట పాటు మద్యం సేవించకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే భోజనం చేసిన వెంటనే సిగరెట్( Cigarette ) తాగితే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే కడుపులో అల్సర్లకు దారి తీస్తుంది.ఇంకా చెప్పాలంటే భోజనం చేసిన వెంటనే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆహారం అసలు జీర్ణం కాదు.అంతే కాకుండా జీర్ణశక్తి తగ్గిపోతుంది.అలాగే కడుపులో అల్సర్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.ఇంకా చెప్పాలంటే గ్యాస్, అజీర్తి, కడుపులో మంట వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.