పెళ్లయిన తర్వాత మొదటి సారి అలా ఫ్యాన్స్ ని ఫిదా చేసిన కత్రినా!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తున్న ఈ జంట డిసెంబర్ 9 వ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

ఇలా వీరి వివాహం తర్వాత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ ముంబై జుహులోని సీ ఫేసింగ్‌ ఇంటికి షిప్ట్ అయ్యారు.

పెళ్లికి ముందు తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచిన ఈ క్యూట్ కపుల్స్. ప్రస్తుతం బహిరంగంగా వీరి ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కత్రినాకైఫ్ తాజాగా ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.బెగీ జిప్‌తో ఉన్న గోధుమ రంగు స్వెటర్, స్మాల్ షార్ట్ ధరించి ఇంట్లో సోఫాలో కూర్చున్న కత్రినా.

Advertisement

సబ్యసాచి డిజైన్ చేసిన మంగళసూత్రం మెడలో ధరించి ఆ మంగళసూత్రం కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇలా మెడలో మంగళ సూత్రంతో ఉన్న ఈమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటో పై ఎంతో మంది నెటిజన్లు స్పందిస్తూ మెడలో మంగళసూత్రంతో ఎంతో సాంప్రదాయబద్ధంగా అందంగా ఉన్నావు అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి కత్రినా కైఫ్ తన క్యూట్ లుక్స్ తో మరోసారి అభిమానుల మనసు దోచేసింది.ఇక సినిమాల విషయానికొస్తే ఈమె సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ చిత్రంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు