బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో కత్రినా కైఫ్ ఒకరు.ఈమె వరుస సినిమాలు చేసి స్టార్ స్టేటస్ అందుకుంది.
స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది.
ఈ బ్యూటీ నటించిన ఫోన్ భూత్ ఈ నెలలోనే రిలీజ్ అయ్యింది.ఇలా సినిమాలు చేస్తూ కెరీర్ లో బాగానే రాణిస్తున్న సమయంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయ్యింది.
గత ఏడాది ఈమె ప్రేమించిన ప్రియుడి చేత మూడు ముళ్ళు వేయించుకుని వివాహ బంధం లోకి అడుగు పెట్టింది.కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2021 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు.
ఈమె ఎంతో మంది హీరోలతో లవ్ స్టోరీలను నడిపి చివరిగా విక్కీని పెళ్లి చేసుకుంది.ఇక వీరి పెళ్లి జరిగి అప్పుడే ఏడాది కూడా గడిచి పోయింది.
మరో పది రోజుల్లో ఈ ప్రేమ జంట తమ మొదటి పెళ్లి రోజును జరుపుకో నున్నారు.మరో 10 రోజులు ఉన్న కూడా అప్పుడే వీరి యానివర్సరీ సందడి స్టార్ట్ అయ్యింది.
ఈ జోడీ ఇక్కడ గ్రాండ్ గా జరుపు కుంటారు అనుకుంటే 10 రోజులు ముందుగానే సైలెంట్ గా మాల్దీవులకు చెక్కేశారు.
ఈ జంట మాల్దీవుల్లోనే గ్రాండ్ గా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకో నున్నారు.ఈ మధ్య స్టార్స్ అంతా ఛాన్స్ దొరికితే చాలు.మాల్దీవులకు చెక్కేస్తూ అక్కడే బీచ్ లో ఎంజాయ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.ఇక ఇప్పుడు ఈ జంట కూడా ముందుగానే మాల్దీవులకు వెళ్లి అక్కడ నుండే ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.దీంతో ఈ జంట సూపర్ గా చూడముచ్చటగా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.