కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది.
ఒక్క రోజులో జరిగిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.ఇక తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
దర్శకుడు లోకేష్ కి కూడా ఊహించని స్థాయిలో ఇమేజ్ తీసుకొచ్చింది.ప్రస్తుతం ఈ మూవీ హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ అవ్వడానికి రెడీ అవుతుంది.
ఖైది సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి రెండేళ్ళు అవుతుంది.అయితే ఇప్పుడు ఓ వ్యక్తి మీడియా ముందుకి వచ్చి ఖైది సినిమా కథ తనది అంటూ నిర్మాతల మీద సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.
ఈ సినిమా తనది అంటూ కేరళకు చెందిన రాజీవ్ అనే వ్యక్తి వాదిస్తున్నాడు.ఒక కేసులో అరెస్ట్ అయ్యి 2007లో విడుదల అయ్యిన రాజీవ్ ఆ తర్వాత స్నేహితుడి ద్వారా డ్రీం వారియర్స్ సంస్థ వారిని సంప్రదించాడట.
వారికి ఆ సమయంలో కథ చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.కథ విన్న తర్వాత మేకర్స్ చాలా కాలం వరకు సైలెంట్ గా ఉండి పోయారు.ఆ కథతో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ సంస్థ వారు సినిమాను నిర్మించారు. తన స్టోరీ లైన్ తో డ్రీమ్ వారియర్స్ తన అనుమతి లేకుండా సినిమాను నిర్మించడం మాత్రమే కాకుండా తనకు కనీసం క్రెడిట్స్ ఇవ్వలేదు అలాగే తన కథకు పారితోషికం కూడా ఇవ్వలేదు అంటూ ఆయన కేరళ హైకోర్టుకు వెళ్లాడు.
అయితే ఈ విషయంపై డ్రీమ్ వారియర్స్ నిర్మాతలు స్పందించి తమకి ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొన్నారు.ఒకవేళ అందితే దానికి సమాధానం చెబుతామని పేర్కొన్నారు.
లోకేష్ కనగరాజ్ కూడా మూవీపై స్పందించేందుకు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఈ వ్యవహారం ఎంత వెళ్తుంది అనేది చూడాలి.