ఉపాధ్యాయ వృత్తిని మించి గౌరవమైనది, బాధ్యతాయుతమైనది మరొకటి లేదు.ఒక తరాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయ వృత్తికి సొంతం.
విద్యా బుద్ధులు చెప్పి పిల్లల్లో మానవ విలువలను చెప్పే వాళ్లు ఉపాధ్యాయులు.అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్లు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
తనను కొన్ని వందల మంది చిన్నారులు చూసి ఆదర్శంగా తీసుకుంటారన్న స్పృహ ఉండాలి.విద్యా బుద్ధులు, మానవ విలువలు చెప్పే వారు అంతే గౌరవంగా వ్యవహరించాలి.
కానీ కొందరు టీచర్లు చేసే పనులు మొత్తం ఆ వృత్తికే కళంకం తీసుకువస్తాయి.ఒకరిద్దరు చేసే పని వారిని తల దించుకునేలా చేస్తుంది.
అలాంటి నీచపు పనే చేసింది ఓ మహిళా టీచర్.
మద్యం సేవించే ఆ టీచరమ్మ పాఠశాలకు వస్తుంది.
వచ్చిన టీచరమ్మ పాఠాలు బోధించడం కాకుండా చాలా పనులు చేస్తుంది.ఏ అల్లరి చేయని విద్యార్థులను చితకబాదుతుంది.
వారిని నోటికి వచ్చినట్లు బూతులు తిడుతుంది.ఆ మద్యం మత్తులోనే ఇతర టీచర్లతో గొడవ పెట్టుకుంటుంది.
అటెండర్లను, ఆయమ్మలను నీచంగా చూస్తుంది.మహిళా టీచర్ కావడంతో ఆమె వద్దు అని చెప్పడం తప్పా.
మరొకటి చేయలేని పరిస్థితి ఆ స్కూల్ ప్రిన్సిపల్ ది.స్కూల్ లో పిల్లలు ఆ టీచరమ్మ చేస్తున్నదంతా ఇంట్లో చెప్పేవారు.వాళ్లు ఒకటీ రెండు సార్లు చెప్పి చూశారు.ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు.దీంతో స్కూల్ కు తాళం వేసి నిరసన తెలిపారు.దీంతో ఉన్నతాధికారులు దిగిరాక తప్పలేదు.
ఆ టీచరమ్మ విధుల నుండి సస్పెండ్ చేశారు.స్కూల్ కు వచ్చి చూసిన ఉన్నతాధికారులకు పాఠశాలలో మద్యం సీసాలు కనిపించాయి.
ఆ టీచర టేబుల్ డ్రాలో మరికొన్ని మందు సీసాలు ఉన్నాయి.అయితే ఆ టీచరమ్మ పేరు గంగలక్ష్మమ్మ .