కడపలో వైకాపా ఎం.ఎల్.ఏ రెచ్చిపోయాడు!!

అధికారం చేఇట్‌లో లేకపోయినా వైకాపా బాగానే ఎగిరెగిరిపడుతుంది.ఉరిమి ఉరిమి మంగళం మీద పడింది అని అంటారు కదా.

ఇప్పుడు ఈ సంఘటన చూస్తే అదే నిజం అని తెలుస్తుంది.అసలు విషయం ఏమిటంటే.

కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో గంగమ్మ జాతర చాలా ఫేమస్.ఈ జాతరకు రాయలసీమ వ్యాప్తంగా జనం తరలివస్తారు.

తెలంగాణలోని సమ్మక్క సారలమ్మ తరహాలోనే.ఇక్కడ కూడా అమ్మవారిని వేరే ప్రాంతం నుంచి ఆలయంలోకి తీసుకువస్తారు.

Advertisement

దగ్గర్లోని చాకలిగుట్టపల్లె నుంచి అమ్మవారిని తీసుకురాడంతోనే ఉత్సవం ప్రారంభమైనట్టు లెక్క.గంగ‌మ్మ త‌ల్లికి పూజ‌లు చేయ‌డానికి వైసీపీ లోకల్ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వచ్చారు.

ఆయన వచ్చిన సమయంలో ఆలయ ఈవో వేరేపనిలో ఉండి ఆయన్ను పట్టించుకోలేదు.దీన్ని శ్రీకాంత్ రెడ్డి అవమానంగా భావించారు.

అందరిముందే ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రోటోకాల్ పాటించండం తెలీదా అని మండిపడ్డారు.

త‌మాషాలు ప‌డుతున్నావా.జాగ్రత్తగా ఉండు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
భూములపై చంద్రబాబు దుష్ప్రచారం.. సీఎం జగన్ ఫైర్

అని వార్నింగ్ ఇచ్చారు.దీంతో ఈవో హడలిపోయారు.

Advertisement

ఇంతలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ రెడ్డి వచ్చి.ఏంజరిగిందని ఈవోని పరామర్శించారు.

అంతే.అప్పటివరకూ దుఃఖం దిగమింగుకున్న ఈవో ఒక్కసారిగా కంటతడిపెట్టారు.

భోరుమంటూ జరిగిన సంగతి చెప్పారు.ఏది ఏమైనా వర్గ బలం.ప్రాంత బలం ఉంటే దానికన్నా అధికారం ఏముంటుందిలే.

తాజా వార్తలు