ఎంపీ అవినాష్ రెడ్డి పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!!

వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) సీబీఐ విచారణకు పలుమార్లు హాజరు కావడం జరిగింది.

 Ka Paul Sensational Comments On Mp Avinash Reddy , Ka Paul, Mp Avinash Reddy, Cb-TeluguStop.com

ఇక ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు.మరోపక్క అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉండటం జరిగింది.

ఇటువంటి పరిణామాల మధ్య సీబీఐ వైయస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయటానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్.

ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐసీయూలో అవినాష్ రెడ్డి చాలా ఒత్తిడి గుండా వెళ్తున్నారు అని కేఏ పాల్( KA Paul ) తెలియజేశారు.ఈ కేసు గురించి ముక్కుసూటిగా నేను వేసిన ప్రశ్నలకు ఆయన అసలు నాకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పారని కేఏ పాల్ తెలిపారు.అందువల్లే సీబీఐ వాళ్లు ఎప్పుడు నన్ను ఎంక్వయిరీకి పిలిస్తే అప్పుడు నేను వెళ్తున్నాను.

కానీ కొంతమంది నన్ను దోషిగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఏదేమైనా ఈ కేసులో న్యాయం జరగాలని కేఏ పాల్ స్పష్టం చేశారు.

అదేవిధంగా అన్యాయంగా నిర్దోషిని దోషిగా చూపించకూడదు.అదేవిధంగా అవినాష్ రెడ్డి తల్లి గారు కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని వేడుకుంటున్నట్లు కేఏ పాల్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube