యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కూడా అభిమానులు ఉన్నారు.నటన విషయంలో తారక్ టాలెంట్ కు ఫిదా అయిన సెలబ్రిటీలు సైతం లక్షల్లోనే ఉన్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో తారక్ క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.తాజాగా ఒక క్వశ్చన్ పేపర్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ ఇంటర్ పరీక్షలో ఇంగ్లీష్ పేపర్ లో ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ పాత్రలో నటించిన తారక్ ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే ఎన్టీఆర్ ను రిపోర్టర్ గా ఇంటర్వ్యూ చేసి ఆయనను ప్రశ్నలు అడగడంతో పాటు ఆయన చెప్పే జవాబులను తెలుపుతూ వ్యాసం రాయాలని పేర్కొన్నారు.ఎన్టీఆర్ పేరును తెలంగాణ ఇంటర్ పేపర్ లో ప్రస్తావించడం గురించి అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.
తారక్ తన అద్భుతమైన నటనతో ఫిదా చేయడం వల్లే ఇలా తారక్ పేరును క్వశ్చన్ పేపర్ లో ప్రస్తావించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తారక్ తర్వాత సినిమాలతో పేరుప్రఖ్యాతులను మరింత పెంచుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు జపాన్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.తర్వాత సినిమాలు కూడా విజయాలను అందుకుంటే ఎన్టీఆర్ రెమ్యునరేషన్ మరింత పెరుగుతుంది.ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ మూడు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయని బోగట్టా.