యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందులో ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతితో పాటు ప్రముఖ ఫస్ట్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన జర్సా కూడా ఉండటం గమనార్హం.
ఆమె ఎందుకు ఉంది అనే డౌట్ చాలామందికి వచ్చింది.ఓ ముఖ్యమైన పని మీద ఆమెని కలిశారంట తారక్.
మరి అదేంటో తెలుసా.?
ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇటీవలే రెండో కుమారుడు భార్గవ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే.భార్గవ్ చిట్టి చేతులు, పాదాలు గుర్తులు కలకాలం గుర్తుండి పోయే జ్ఞాపకాన్ని తయారు చేసేందుకు భావన జర్సాను పిలిపించినట్లు తెలుస్తోంది.

చిన్నారుల లేలేత పాదాలను, చేతులను అలాగే స్పర్శిస్తూ.ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.ఆ చిన్నిచేతులు కాళ్లు పెరిగిపెద్దయ్యే అపురూప క్షణాలను అద్భుతంగా మనసులో దాచుకుంటారు.
అరచేతిలో ఇమిడిపోయే ఆ చిన్నిపాదాలను ముద్రలుగా చేసి ఫ్రేమ్లో భద్రపరిస్తే.తరతరాలకు చెరగని ముద్రగా నిలిచిపోతుంది.

బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే అపారమైన ప్రేమ, పెద్దలపై పిల్లలకు ఉండే గౌరవం, సెలబ్రేటీలపై ఉండే అభిమానం ఇవ్వన్నీ చేతి, కాలి వేలిముద్రలను తీసి అందమైన ఆకృతులుగా తీర్చిదిద్దారు.

భావన జస్ర ఆమె ఈ రంగంలో ఏంతో పేరు గాంచింది.తెలుగు యాక్టర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మనవడు, డాషింగ్, వర్సటైల్ యాక్టర్ జూ ఎన్టీఆర్తో కలిసి పని చేయడంతో ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది అని భావన జర్సా తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా భారవ్ రామ్ జ్ఞాపకాలను తయారు చేసి… ఎన్టీఆర్ దంపతులకు అందించబోతున్నారు భావన జర్సా.







