టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం ఒకే జీవితం.ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది.కాగా ఇందులో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటిలాగా కాకుండా ఈసారి కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు చిత్ర బృందం.ఈ సినిమాలో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా మరొక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
కాగా తాజాగా ప్రమోషన్స్ లో బాగా కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను మాట్లాడుతూనే మధ్యలో వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుకున్నారు.
ఇక ఆ విషయంలో భాగంగానే హీరో శర్వానంద్ కాలేజీ డేస్ ని గుర్తుచేసుకున్నారు.ఇక ఆ జ్ఞాపకాలతో పాటు హీరో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ని రివిల్ చేశాడు శర్వానంద్.
అదేమిటంటే ఎన్టీఆర్ శర్వానంద్ ఇద్దరు కలిసి ఇంటర్మీడియట్ ఒకే కాలేజిలో చదువుకున్నారట.కానీ ఎన్టీఆర్ ఇంటర్ మొదటి సంవత్సరంలోనే కాలేజ్ ని వదిలేసి వెళ్లిపోయాడట.ఈ విషయాన్ని శర్వానంద్ ఎక్కడ కూడా ప్రస్తావించలేదని, సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఈ సీక్రెట్ ని, రివీల్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చాడు శర్వానంద్.
అయితే సినిమా షూటింగ్ కోసమే ఎన్టీయార్ అలా కాలేజీ వదిలేసి వెళ్లిపోయాడనీ, సెకండ్ ఇయర్ ఎన్టీయార్ ఎక్కడ చదివాడో కూడా తనకు తెలియదనీ శర్వానంద్ చెప్పుకొచ్చాడు.అయితే శర్వానంద్ వ్యాఖ్యలపై స్పందించిన పలువురు నెటిజెన్స్ మొత్తానికి తన సినిమా ప్రమోషన్లలో ఎన్టీయార్ ని భలే వాడేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.శర్వానంద్ హీరోగా నటించిన ఓకే జీవితం సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది.
రిలీజ్ డేట్ ఎప్పుడు అన్న విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు.