తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న అలనాటి హీరోయిన్

సౌత్ ఇండియాలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జయంతి.హీరోయిన్ గా కెరియర్ ఆరంభించి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించారు.

కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.నిన్న అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకి గురికావడంతో ఆమె హాస్పిటల్ లో చేరి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు.

ఆమె గత మూడున్నర దశాబ్దాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు జయంతిని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటిలేటర్ అమర్చారు.అయితే, జయంతి బాధపడుతున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు కరోనా పరీక్షలు చేయించినట్టు తెలుస్తోంది.ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చినట్టు సమాచారం.

Advertisement

జయంతి తనయుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని వెల్లడించారు.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆమె సినిమాలకి కూడా దూరంగా ఉన్నారు.

ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు జయంతి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు