జనసేన టీడీపీ పొత్తుపై స్పష్టమైన క్లారీటి వచ్చేసింది. శ్రీకాకుళం సభ ద్వారా పొత్తుపై స్పష్టతను ఇచ్చారు పవన్, ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో గౌరవప్రదమైన పొత్తుకు సిద్ధమని ప్రకటించారు.
పొత్తు ఖరారు అయినప్పటికీ వచ్చిన చిక్కల్లా సీట్ల విషయంలోనే. జనసేన పార్టీకి టీడీపీ ఎన్ని సీట్లు కేటాయించాలనుకుంటుందో టీడీపీ తర్జనభర్జన పడుతోంది.
సీట్లు అడిగినన్ని ఇవ్వాలని జనసేన పట్టుబడుతుంది. ఒప్పందం గౌరవప్రదంగా లేకపోతే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమని పవన్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
సీట్లు విషయంలో జనసేన రాజీపడదని, ఈ ఎన్నిక కాకపోతే వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని లేదా బీజేపీ పొత్తు పెట్టుకోనైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని పవన్ ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎటు వచ్చిన నష్టమంతా టీడీపీకే అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
మెజారిటీకి అవసరమైన సీట్ల సంఖ్యను టీడీపీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలంటే తన సహాకారం ఖచ్చితమనే పవన్ భావిస్తున్న నేపథ్యంలో తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేదిలేదని జనసేన ముఖ్య నేతలతో సవన్ అన్నట్లు సమాచారం.
ఈ ఎన్నికలో టీడీపీ గెలవాలంటే జనసేనతో పొత్తు అనివార్యమని టీడీపీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండే పలువురు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని పార్టీ అధినాయకత్వం సూచిస్తుందిఅంటే, సీట్ల పంపకంలో భాగంగా టీడీపీ కనీసం 40-50 శాతం సీట్లను జనసేన పార్టీకి త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా, జనసేనతో కలిసి టీడీపీ ఎన్ని సీట్లు పంచుకోవడానికి సిద్ధంగా ఉంటుందో అనేది స్పష్టత లేదు.
అయిత ే ఈ విషయంలో చంద్రబాబు కూడా మాస్టర్ ప్లాన్ వేసినట్లు కనిపిస్తుంది.జనసేన సరైన అభ్యర్థులు లేని కారణంగా పొత్తులో జనసేన పోటీ చేసే సీట్లలో టీడీపీ నాయకులనే ఆ పార్టీలోకి పంపి వారితో పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.ఈ