రేపు ఉమ్మడి కడప జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.ఏపీలో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కౌలు రైతుల భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ యాత్రలో భాగంగా పర్యటన కొనసాగనుంది.
పర్యటనలో భాగంగా జిల్లాలోని సిద్ధవటం గ్రామంతో రచ్చబండ కార్యక్రమం జరగనుంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.అనంతరం ఆత్మహత్యలకు పాల్పడ్డ పలువురు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.