జన జాగరణ సమితి వినూత్న నిరసన...

ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి వినూత్న నిరసన విశాఖపట్నం రుషికొండలోని ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లే దారిలో రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి కి స్వాగతం- సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి వినూత్న నిరసన తెలిపింది.ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో స్థిరస్థాయిగా మిగిలిపోతారని… రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అంతటి గొప్ప రికార్డు సృష్టించిన జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా సన్మానం చేసి “క్యాపిటల్ లెస్ సీఎం” బిరుదు ఇవ్వాలని కోరారు.

 Jana Jagarana Samiti Is An Innovative Protest By Flexis, Jana Jagarana Samiti ,-TeluguStop.com

ఎన్నికలకు ఏడాది ముందు మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు, అదాని డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రుల చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నారని… ఇక్కడ ప్రజలు ఎవరు కూడా జగన్ ను నమ్మే పరిస్థితుల్లో లేరు అని అన్నారు.అంతేకాకుండా 29 వేల మంది అమరావతి రైతు కుటుంబాల కాపురాలను రోడ్డున పడేసి ముఖ్యమంత్రి జగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే విశాఖలో కాపురం పెడతానని ప్రకటించారని ఉత్తరాంధ్రవాసులు చర్చించుకుంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్ పై స్వామి భక్తి నిరూపించుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రసాద్ రెడ్డి ప్రజాస్వామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేసిన జన జాగరణ సమితి నాయకుల పైన అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారు అని ముఖ్యమంత్రి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వాసులను జాగృతం చే

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube