ఎన్నికల సంవత్సరంలోకి ప్రవేశించినందున పూర్తిస్థాయిలో ఎన్నికల సన్నద్దత కు సిద్ధంగా ఉండాలని వెలగపూడి లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రి వర్గ సభ్యులకు ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) దిశా నిర్దేశం చేశారని వార్తలు వస్తున్నాయి.ప్రభుత్వం సంతృప్తికర స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున వాటిని ప్రజల్లో భారీ ఎత్తున ప్రచారం చేయాలని, ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం చాలా చోట్ల పూర్తి అయ్యిందని ,మిగిలిన చోట్ల కూడా పూర్తి చేసే చర్యలు తీసుకోవాలని జగన్ వాఖ్యానించినట్టుగా వార్తాలు వస్తున్నాయి .

జగనన్న సురక్ష పథకానికి అద్భుతమైన స్పందన వస్తుంది అని దానిలో మంత్రులు కూడా భాగస్వామ్యం కావాలని జగన్ సూచించారని తెలుస్తుంది.ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు మన పక్కనే ఉన్నారని, చేసిన మంచిని వివరించాలని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చే ప్రతి పథకంలోనూ మంత్రులు ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేసే బాధ్యత మీరే తీసుకోవాలని, మీ జిల్లాలలో పార్టీ గెలుపు బాధ్యతలు మీరు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రులతో చెప్పుకొచ్చారట .

ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అలసత్వం కూడదని నియోజకవర్గాల వారీగా ప్రజలందరితోనూ ప్రత్యక్షంగా కలవాలని, వారి సమస్యలను తీర్చే ప్రయత్నం చేయాలని జగన్ చెప్పుకొచ్చారని తెలుస్తుంది.తమ సంక్షేమ పథకాలే( Welfare schemes ) తమను గెలిపిస్తాయని నమ్ముతున్న జగన్ వాటి అమలను ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకూడదు అనే కృత నిశ్చయం తో ఉన్నట్లుగా తెలుస్తుంది.అయితే మౌలిక సదుపాయాల మీద ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో కొందరు ప్రజాప్రతినిధులు గడపగడప కార్యక్రమానికి గైర్హాజరవుతున్నారని వస్తున్న వార్తల పై జగన్ వారిపై సీరియస్ గానే స్పందించినట్లు తెలిసింది సమస్యలను సర్దుబాటు చేసుకోవాలని, నిధులను అందుబాటులోకి తీసుకొస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకతను సహించని కొంత ఘాటుగానే చెప్పారని తెలుస్తుంది