రాజకీయ గురువుకు చుక్కలు చూపిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే!

2019 సార్వత్రిక ఎన్నికలలో భారీ విజయాన్ని మూటగట్టుకున్న వైసిపి టీడీపీ నేతల ఆర్థిక ములాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.

దానితో 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఇప్పుడు టీడీపీ నుండి జెండా ఎత్తేస్తున్నారు.

ఇది కంట్రోల్ చేయడం కోసం చంద్రబాబు అండ్ టీం తీవ్రంగా శ్రమిస్తుంది.ఒకరకంగా ఇది కంట్రోల్ చేసి క్యాడర్ ను కాపాడుకోవడం కోసం జగన్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయడం కోసమే ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని చంద్రబాబు తెరమీదకి తీసుకొచ్చారు.

To His Political Teacher An Mla Teaching New Political Lessons, YSRCP, Chandraba

అది కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రభావం చూపుతుంది.ప్రస్తుత అధికార పార్టీ లేడీ ఎమ్మెల్యే టీడీపీలో ఉన్న తన రాజకీయ గురువుపై ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకు వచ్చినా పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నారు.ఆయన ఆ రాజకీయం తట్టుకోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపికి మకాం మర్చాలని ప్రయత్నిస్తున్నారట మరి ఆ ఎమ్మెల్యే ఆమె ఎవరో రాజకీయ గురువు ఎవరో ఇప్పుడు చూద్దాం.2019 ఎన్నికలలో తన రాజకీయ గురువైన పత్తిపాటి పుల్లారావు ను ఓడించిన విడతల రజినీ ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ లో పుల్లారావు దగ్గరున్న నాయకులను ఒక్కొక్కరిగా టార్గెట్ చేసి తన క్యాంప్ లోకి లాగేసుకుంటున్నారట.దీన్ని పత్తిపాటి పుల్లారావు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేకపోతున్నారట అందుకే ఈ విషయాన్ని కట్టడి చేయడానికి క్యాంప్ మారిస్తే ప్రయోజనం ఉంటుందేమో అని ఆయన భావిస్తున్నారని సమాచారం.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు