ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ – కరవు కవల పిల్లలని విమర్శించారు.
రెండింటిదీ విడదీయలేని బంధం అని ఎద్దేవా చేశారు.
జగన్ ఎక్కడుంటే కరవు అక్కడ ఉంటుందని లోకేశ్ ఎద్దేవా చేశారు.
రైతులను ఓడించిన జగన్ పని అయిపోయిందని తెలిపారు.జగన్ సర్కార్ వచ్చిన తరువాత రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో రైతులను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.