గుంటూరు కారం విషయంలో జరిగిన తప్పు ఇదే.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Superstar Mahesh Babu )హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారం( Guntur Karam ).

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీల అలాగే మీనాక్షి చౌదరిలు( Meenakshi Chaudhary ) హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.కొన్ని కొన్ని ప్రదేశాలలో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

అయితే సినిమా విడుదలకు ముందు ఈ సినిమాపై వచ్చిన టాక్ ని చూసి ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశపడ్డారు.

కానీ ఊహించని విధంగా ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.ఈ సినిమాకు నిర్మాతగా నాగవంశీ( Nagavanshi ) వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ గుంటూరు కారం సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.గుంటూరు కారం సినిమా మాకు బాగా నచ్చింది.కంటెంట్ పరంగా ఆ మూవీలో ఎలాంటి తప్పూ లేదు.

అలాగే సినిమా కమర్షియల్‌ గా కూడా బాగానే సక్సెస్ అయ్యింది.కానీ ఒక్క నైజాంలోనే కలెక్షన్స్ పరంగా డ్యామేజ్ అయింది.

ఆ మూవీకి గుంటూరు కారం అని టైటిల్ పెట్డడం ఒక తప్పు అని నేను భావిస్తున్నాను.ఫ్యామిలీ మూవీకి మాస్ టైటిల్ పెట్టడం, పైగా మిడ్ నైట్ 1 AM షో వేయడం కూడా తప్పు అయి ఉండవచ్చు అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు ఆయన మాటలను సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదు అంటూ ఇతర కారణాలను చెప్పుకొస్తున్నారు.

ఇకపోతే హీరో మహేష్ బాబు విషయానికి వస్తే.ఈ సినిమా తర్వాత ప్రస్తుతం రాజమౌళితో ఒక సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

రెండోసారి పెళ్లి చేసుకున్న డాక్టర్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటోలు!
Advertisement

తాజా వార్తలు