సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణానికి చెందిన అన్నపూర్ణమ్మ అనే వృద్ధురాలు మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృత్యువాత పడింది.దహన సంస్కారాలకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు సహాయం చేయాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఆశ్రయించారు.
కానీ,ఎంతకీ వారు స్పందించకపోవడంతో రాత్రంతా కోదాడ వైకుంఠధామం వద్ద పడిగాపులుగాసిన నిర్వేదంతో నిండిన ఘటన అందర్నీ ఆలోచింప చేసింది.ఈ సందర్భంగా వృద్ధురాలి కుటుంబ సభ్యులు మాట్లడుతూ మునిసిపల్ సిబ్బందికి ఎంత మొర పెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని,పుట్టెడు దుఃఖంలో ఉన్న తమని అధికారులు స్పందించి దహన సంస్కారాలు చేసి ఆదుకోవాలని వేడుకున్నారు.
నిన్న మంగళవారం రాత్రి నుండి శవంతో శ్మశాన వాటికలో చలిలో పడిగాపులుగాసినా బుధవారం మద్యాహ్నం వరకు మున్సిపల్ సిబ్బంది స్పందించలేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు.అయితే ఇది ఇలా ఉంటే ఏమి పట్టనట్లుగా తమకి ఇప్పుడే తెలిసినట్లుగా ఈ రోజు మద్యహ్నం తరువాత ఈ విషయంపై కమీషనర్ స్పందించి మున్సిప్ సిబ్బంది పంపించి అంత్యక్రియలు నిర్వహించారు.